7 వికెట్ల తేడాతో బెంగళూరు విక్టరీ
NEWS Mar 22,2025 10:57 pm
ఐపీఎల్ 2025లో భాగంగా కోల్ కతా లోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన ప్రారంభ మ్యాచ్ లో రజిత్ పాటిదార్ సారథ్యంలోని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చేసిన రహానే సారథ్యంలోని కోల్ కతా నైట్ రైడర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 174 పరుగులు చేసింది. అనంతరం బరిలోకి దిగిన ఆర్సీబీ 17.3 ఓవర్లలోనే 3 వికెట్లు కోల్పోయి 177 రన్స్ చేసింది. ఫిల్ సాల్ట్ 56 రన్స్ చేస్తే విరాట్ కోహ్లీ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. 4 ఫోర్లు 3 సిక్స్ లతో 59 రన్స్ చేశాడు. స్కిప్పర్ రజిత్ పాటిదార్ 15 బంతులు ఎదుర్కొని 34 రన్స్ చేశాడు. 5 ఫోర్లు ఒక సిక్సర్ కొట్టాడు. ఆదివారం ఎస్ఆర్ హెచ్, ఆర్ఆర్, చెన్నై వర్సెస్ ముంబై మధ్య జరగనుంది.