ఆర్సీబీ లక్ష్యం 175 రన్స్
NEWS Mar 22,2025 09:19 pm
కోల్ కతా వేదికగా ఐపీఎల్ 2025 టోర్నీలో భాగంగా జరిగిన ప్రారంభ మ్యాచ్ లో కోల్ కతా నైట్ రైడర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 175 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది ప్రత్యర్థి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు. ఆర్సీబీ బౌలర్లు భారీ స్కోర్ చేయకుండా కట్టడి చేయడంలో సక్సెస్ అయ్యారు. కోల్ కతా కెప్టెన్ అజింక్యా రహానే 56 పరుగులు చేశాడు. 30 బంతులు ఎదుర్కొని 6 ఫోర్లు 4 సిక్సర్లతో విరుచుకు పడ్డాడు. సునీల్ సరైన్ 34 రన్స్ చేయగా రఘువంశీ 30 పరుగులతో రాణించారు. ఆర్సీబీ స్కిప్పర్ రజిత్ పాటిదార్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్నాడు.