షారుక్ ఖాన్ తో కలిసి కోహ్లీ డ్యాన్స్
NEWS Mar 22,2025 08:32 pm
ప్రపంచ క్రికెట్ లో అత్యధిక జనాదరణ కలిగిన ఐపీఎల్ 2025 టోర్నీ కోల్ కతా ఈడెన్ గార్డెన్ వేదికగా అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. ఈ సందర్బంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ తో కలిసి క్రికెటర్ విరాట్ కోహ్లీతో కలిసి డ్యాన్స్ చేశారు. ఈ ఐపీఎల్ 18వ సీజన్. క్రీడా మైదానంలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారారు సినీ రంగానికి చెందిన నటీ నటులు. ప్రముఖ గాయని శ్రేయా ఘోషల్, పంజాబీ సింగర్ కరన్ హౌజ్లా తమ పాటలతో ఆకట్టుకున్నారు. స్టేడియం మొత్తం చప్పట్లతో మారు మ్రోగింది.