రెవెన్యూ శాఖలో జీపీఓ పోస్టులు మంజూరు
NEWS Mar 22,2025 02:10 pm
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు రెవెన్యూ శాఖలో కొత్తగా గ్రామ పాలన అధికారులకు సంబంధించి పోస్టులు మంజూరు చేసింది ఆర్థిక శాఖ. ఈ మేరకు శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. వీటిని జీపీఓలుగా పిలుస్తారని తెలిపింది. నూతన గ్రామ రెవన్యూ అధికారుల వ్యవస్థలో భాగంగానే ఈ పోస్టులను మంజూరు చేశామన్నారు ఆర్థిక శాఖ కార్యదర్శి.