ఏపి లాసెట్ 2025 నోటిఫికేషన్ విడుదల
NEWS Mar 22,2025 09:14 am
ఏపీ విద్యా శాఖ కీలక ప్రకటన చేసింది. న్యాయ విద్యలో ప్రవేశం కోసం నిర్వహించే లా సెట్ 2025 నోటిఫికేషన్ విడుదల చేసింది. ఎల్ఎల్బీ (3 yrs, 5 yrs) పిజి లాసెట్ ఎల్ఎల్ఎం (2 yrs) కోర్సులకు సంబంధించి మార్చి 25వ తేదీ నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు తెలిపింది. 3 ఏళ్ల ఎల్ఎల్బీ కోర్సుకు ఏదైనా డిగ్రీ పాసై ఉండాలని, 5 ఏళ్ల ఎల్ఎల్బీ కోర్సుకు ఇంటర్ ఉత్తీర్ణులై ఉండాలని, 2 ఏళ్ల ఎల్ఎల్ఎం పీజీ కోర్సుకు ఎల్ఎల్బీ డిగ్రీ పాసై ఉండాలని స్పష్టం చేసింది. దరఖాస్తు చేసుకునేందుకు వచ్చే నెల ఏప్రిల్ 27వ తేదీ వరకు గడువు విధించింది. ఈ ఏడాది ఆగస్టు 5వ తేదీన ఉదయం 9 గంటల నుంచి 10.30 గంటల వరకు పరీక్ష చేపట్టనున్నట్లు వెల్లడించింది. పూర్తి వివరాలకు cets.apshe.ap.gov.in పరిశీలించాలని సూచించింది.