శాసనసభ సమావేశాలు అట్టర్ ఫ్లాప్
NEWS Mar 22,2025 08:33 am
మాజీ మంత్రి అంబటి రాంబాబు నిప్పులు చెరిగారు. ఏపీ సర్కార్ పాలనా పరంగా విఫలమైందన్నారు. చివరకు శాసన సభ సమావేశాలు నిర్వహించడంలో కూడా సక్సెస్ కాలేక పోయిందంటూ ఎద్దేవా చేశారు. వ్యక్తిగత ప్రచారంపై పెట్టిన దృష్టి ప్రజా సమస్యల పరిష్కారంపై ఫోకస్ పెట్టడం లేదంటూ మండిపడ్డారు. ప్రశ్నావళితో అప్పులపై అబద్ధాల గుట్టు బయట పడిందన్నారు. సొంత డబ్బా కొట్టుకోవడానికే పుణ్య కాలం సరి పోతోందంటూ సెటైర్ వేశారు. వ్యవస్థలను నిర్వీర్యం చేయడం దారుణమన్నారు. ఇచ్చిన హామీలను అమలు చేయకుండా తాత్సారం చేయడం పట్ల తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు అంబటి రాంబాబు.