ఏపీలో ఆపరేషన్ గరుడ
NEWS Mar 22,2025 08:28 am
ఏపీ డిజీపీ హరీష్ కుమార్ గుప్తా జూలు విదిల్చారు. ఈగల్ టీం, విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్మెంట్ , పోలీసులు, డ్రగ్స్ శాఖల సంయుక్త ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఒకేసారి డ్రగ్స్ దుర్వినియోగంపై ఫోకస్ పెట్టారు. ఇందులో భాగంగా మెడికల్ షాపులు, మెడికల్ ఏజెన్సీలపై దాడులు చేపట్టినట్లు వెల్లడించారు ఎలైట్ యాంటీ-నార్కొటిక్స్ గ్రూప్ ఫర్ లా ఎన్ఫోర్స్మెంట్ ఐజీ ఆకే రవి కృష్ణ. మొత్తం 100 బృందాలతో ఈ తనిఖీలు చేపట్టినట్లు స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, హోం మంత్రి వంగలపూడి అనిత ఆదేశాల మేరకు ఆపరేషన్ గరుడ ను చేపట్టడం జరిగిందన్నారు.