హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత
NEWS Mar 22,2025 08:23 am
నేరాల నియంత్రణలో టెక్నాలజీ కీలకమైన పాత్ర పోషిస్తుందని అన్నారు మంత్రి వంగలపూడి అనిత. శాంతి భద్రతలను కాపాడే విషయంలో రాజీ పడవద్దని పోలీసులకు సూచించారు. చిన్నారులు, మహిళల భద్రతకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పారు. ప్రతి 3 నెలలకోసారి శాంతి భద్రతలపై ఉన్నత స్థాయి సమీక్ష చేపడతామన్నారు. పటిష్ట భద్రతతో శాసనసభ సమావేశాల నిర్వహణ అభినందనీయమన్నారు. నేరం జరగగానే నిందితులను పట్టుకోవడం పట్ల డీజీపీని, పోలీసులను ప్రశంసించారు మంత్రి.