అవేజ్ ను సన్మానించిన పిసిసి నాయకులు
NEWS Mar 22,2025 09:16 am
జై బాబు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమంలో భాగంగా రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్రలు నిర్వహించడానికి వీలుగా వేములవాడ, సిరిసిల్ల నియోజకవర్గాలకు కోఆర్డినేటర్ గా మెట్ పల్లి పట్టణానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఎండీ ఆవేజ్ ను నియమించారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. ఈ సందర్బంగా హైదరాబాదులోని తమ కార్యాలయంలో అవేజ్ ను శాలువాతో సన్మానించారు పిసిసి నాయకులు కొమిరెడ్డి కరంచంద్, విజయ్ ఆజాద్, స్థానిక న్యాయవాది సురభి అశోక్.