ఏపీలో విద్యార్థులకు ఖుష్ కబర్
NEWS Mar 22,2025 08:02 am
ఏపీ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. విద్యార్థులకు తీపి కబురు చెప్పింది. ఫీజు రీయింబర్స్మెంట్ పథకానికి రూ.600 కోట్లు విడుదల చేసినట్లు వెల్లడించినట్లు తెలిపారు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి. 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి ఈ నిధులను రిలీజ్ చేసినట్లు వెల్లడించారు రాష్ట్ర విద్యా కార్యదర్శి కోన శశిధర్. త్వరలో మరో రూ. 400 కోట్లు రిలీజ్ చేయనుందని స్పష్టం చేశారు.