సబ్సిడీ పైన రైతులకు వ్యవసాయ పరికరాలు
NEWS Mar 22,2025 09:19 am
సబ్సిడీపైన రైతులకు వ్యవసాయ పరికరాలు ఇవ్వనున్నట్లు నాగల్గిద్దా మండల వ్యవసాయ అధికారి ప్రవీణ్ చారి తెలిపారు. ఎస్సీ , ఎస్టీ రైతులకు 50 శాతం సబ్సిడీ , జనరల్ మహిళలకు 40 శాతంపై సబ్సిడి పరికరాలు ఇవ్వనున్నట్లు వెల్లడించారు. ఈ నెల 24వ తేది వరకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. రైతులు పట్టా పాస్ బుక్ , ఆధార్ కార్డు జిరాక్స్ తో పాటు పాస్ పోర్ట్ సైజ్ ఫోటోతో దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు ఏవో.