ముస్లిం విద్యార్థులకు ఇఫ్తార్ ఏర్పాటు
NEWS Mar 21,2025 07:54 pm
మెట్ పల్లి పట్టణంలోని శ్రీ సూర్యదయ హైస్కూల్ లో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ఇంగ్లీష్ మీడియం లో చదువుకుంటున్న ముస్లిం విద్యార్థులు, టీచర్లు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల యాజమాన్యం, కరస్పాండెంట్ దొంతుల రాజకుమార్, డైరెక్టర్ చర్లపల్లి రాజేశ్వర్ గౌడ్, ప్రిన్సిపల్ విజయ కుమారి, ఉపాధ్యాయులు హాజరయ్యారు. వారికి శుభాకాంక్షలు తెలిపారు.