ఆస్తి పన్నుపై ప్రత్యేక మేళా
NEWS Mar 21,2025 07:55 pm
మెట్ పల్లి మున్సిపల్ కార్యాలయంలో సోమవారం, బుధవారం ఆస్తి సమస్యలపై రెవెన్యూ మేళా నిర్వహిస్తున్నట్లు మున్సిపల్ కమిషనర్ టి.మోహన్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆస్తి పన్ను సమస్యలు ఏమైనా ఉంటే కార్యాలయంలో సంప్రదించి పరిష్కరించు కోవాలన్నారు. పట్టణ ప్రజలు ఈ సదవకాశాన్ని వినియోగించు కోవాలని కమిషనర్ కోరారు.