కమీషన్ల కోసం ఓఆర్ఆర్ ను అమ్ముకున్నారు
NEWS Mar 21,2025 04:34 pm
శాసన సభలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో కమీషన్ల కోసం ఓఆర్ఆర్ ను రూ. 7,300 కోట్లకు అమ్ముకున్నారంటూ మండిపడ్డారు. లక్ష కోట్ల విలువ చేసే రోడ్డును ఇలా తక్కువ ధరకు అమ్ముకోవడం ఎంత వరకు సబబు అని ప్రశ్నించారు. అందుకే తాము వచ్చాక దానిపై విచారణకు ఆదేశించామన్నారు. ఇక హరీష్ రావు ఎన్ని మాట్లాడినా వేస్ట్ అన్నారు. ఆయనను ముందు ఉంచి వెనుక ఉండి తండ్రీ కొడుకులు నడిపిస్తున్నారంటూ ధ్వజమెత్తారు కోమటిరెడ్డి.