ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ నివాసంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ సందర్బంగా మంటలు ఆర్పే క్రమంలో తన ఇంట్లో పెద్ద ఎత్తున నోట్ల కట్టలు బయట పడ్డాయి. దీంతో జనం అవాక్కయ్యారు. ప్రత్యేకించి సుప్రీంకోర్టు సీరియస్ గా తీసుకుంది ఈ విషయాన్ని. కొలీజియం ఏకాభిప్రాయంతో వర్మను అలహాబాద్ హైకోర్టుకు బదిలీ చేయాలని నిర్ణయించింది. ప్రస్తుతానికి వర్మ మాత్రమే బయట పడినా ఒకవేళ దేశ వ్యాప్తంగా సోదాలు చేపడితే ఇంకెంత మంది జడ్జీలు నోట్ల కొట్టలతో దొరుకుతారనేది తలుచుకుంటేనే భయం వేస్తోంది.