వెంకన్న ఆలయాల నిర్మాణాల కోసం ట్రస్ట్ ఏర్పాటు
NEWS Mar 21,2025 03:27 pm
సీఎం చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. దేశ వ్యాప్తంగా శ్రీవారి ఆలయాలను నిర్మించేందుకు కృషి చేస్తామన్నారు. ఇందుకు గాను అన్ని రాష్ట్రాల సీఎంలకు లేఖలు రాస్తామన్నారు. చాలా గ్రామాల్లో వేంకటేశ్వరస్వామి దేవాలయాలు లేవన్నారు. ఆలయాల నిర్మాణాల కోసం నిధులు సేకరించేందుకు ట్రస్టు ఏర్పాటు చేస్తామని చెప్పారు. నాడు ఎన్టీఆర్ అన్నదానం, నేను ప్రాణదానం కార్యక్రమాలు ప్రవేశ పెట్టామన్నారు మూడవ కార్యక్రమంగా ఆలయాల నిర్మాణాలను తలపెడుతున్నామని తెలిపారు. ట్రస్ట్కు వచ్చే నిధులు పకడ్బందీగా ఖర్చు చేస్తామన్నారు. వేంకటేశ్వరస్వామి ఆస్తులు ఎవరు కబ్జా చేసినా వాటిని తిరిగి దేవుడికే చెందేలా చేస్తామని వార్నింగ్ ఇచ్చారు.