పాదయాత్ర చేస్తా ప్రజలను కలుస్తా
NEWS Mar 21,2025 10:47 am
మాజీ మంత్రి కేటీఆర్ కీలక ప్రకటన చేశారు. తాను ప్రజలను కలిసేందుకు త్వరలోనే పాదయాత్ర చేస్తానని వెల్లడించారు. బీఆర్ఎస్ను తిరిగి అధికారంలోకి తీసుకు రావడమే లక్ష్యంగా ముందుకు సాగుతానని అన్నారు. పాదయాత్ర కోసం ప్రస్తుతం కసరత్తులు జరుగుతున్నాయని వెల్లడించారు. ప్రస్తుతం జిల్లా పర్యటనలు ప్రారంభమయ్యాయని చెప్పారు. ఏడాది చివర వరకు పార్టీని బలోపేతం చేసే పనిపై ఫోకస్ పెట్టామన్నారు. తన పాదయాత్ర వచ్చే ఏడాది ఉండవచ్చని చావు కబురు చల్లగా చెప్పారు.