పంటలు ఎండిపోతుంటే అందాల పోటీలా..?
NEWS Mar 21,2025 09:56 am
బీఆర్ఎస్ నిప్పులు చెరిగింది. కాంగ్రెస్ సర్కార్ ఆధ్వర్యంలో హైదరాబాద్ లో అందాల పోటీలు నిర్వహించడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు మాజీ మంత్రి కేటీఆర్. ఓ వైపు నీళ్లు అందక పంటలు ఎండి పోతుంటే మిస్ వరల్డ్ పోటీలు ఎలా నిర్వహిస్తారంటూ ప్రశ్నించారు. దీనిపై తీవ్రంగా స్పందించారు సీఎం రేవంత్ రెడ్డి. అందాల పోటీలు చేపడితే మీకు వచ్చిన బాధ ఏమిటంటూ మండిపడ్డారు. ఈ పోటీల వల్ల హైదరాబాద్ కు బ్రాండ్ ఇమేజ్ పెరుగుతుందన్నారు. పర్యాటక రంగానికి మేలు జరుగుతుందని పేర్కొన్నారు. ఇదే సమయంలో మంత్రి జూపల్లి ఏకంగా ఈ పోటీల వల్ల ఉద్యోగ, ఉపాధి అవకాశాలు దక్కుతాయని చెప్పడం దారుణమన్నారు కేటీఆర్.