9 ఏళ్ల కిందట ప్రమోట్ చేశా
NEWS Mar 20,2025 07:11 pm
బెట్టింగ్ యాప్ కేసుకు సంబంధించి కీలక వ్యాఖ్యలు చేశారు ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్. సినీ రంగానికి చెందిన దగ్గుబాటి రానా, విజయ్ దేవరకొండ, శ్రీముఖి, ప్రకాశ్ రాజ్ , మంచు లక్ష్మితో పాటు మొత్తం 25 మందిపై కేసులు నమోదు చేశారు మియాపూర్ పోలీసులు. ఇప్పటికే 11 మంది యూట్యూబర్లపై కేసు నమోదు చేయడంతో పాటు నోటీసులు జారీ చేశారు. గురువారం ఇందుకు సంబంధించి విష్ణుప్రియ, రీతు చౌదరని విచారణకు హాజరయ్యారు. ఈ ఘటనపై స్పందించారు ప్రకాశ్ రాజ్. తాను 9 ఏళ్ల కిందట బెట్టింగ్ యాప్ ను ప్రమోట్ చేశానని, ఆ తర్వాత మానుకున్నానని చెప్పారు.