ఘనంగా పాఠశాల వార్షికోత్సవ వేడుకలు
NEWS Mar 20,2025 10:38 am
మల్లాపూర్ మండలంలోని హుస్సేన్ నగర్ ప్రాథమి క పాఠశాలలో వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. విద్యార్థుల ఆట పాటలతో ఉర్రూతలూ గించారు. విద్యార్థులు మంచి చదువు నేర్చుకొని ఉన్నత స్థాయికి ఎదగాలని ప్రధానోపాధ్యాయులు కస్తూరి భాగ్యలక్ష్మి ఆకాంక్షించారు. బదిలీపై వెళ్లిన సతీష్ ను సన్మానించారు. TGUS జిల్లా శాఖ అధ్యక్షులు నునావత్ రాజు, TRTF కార్యదర్శి జంగా గంగాధర్, ఉపాధ్యాయులు ముజాబీర్, ప్రవీణ, కీర్తన, శ్రీనివాస్, గంగాధర్, సరిత, అంగన్వాడి టీచర్ జ్యోతి, గ్రామ ప్రజలు, తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు.