నక్సల్ రహిత దేశంగా భారత్
NEWS Mar 20,2025 03:35 pm
ఛత్తీస్గఢ్లో 22 మంది నక్సలైట్లు మరణించడంపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. ఇవాళ భారత సైనికులు నక్సల్ ముక్తి భారత్ అభియాన్ లో భాగంగా పెద్ద విజయాన్ని సాధించారని అన్నారు.. ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ , కాంకేర్లలో భద్రతా దళాలు నిర్వహించిన రెండు వేర్వేరు ఆపరేషన్లలో నక్సల్స్ ఖతం కావడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. నక్సల్స్ పై కఠిన వైఖరి కొనసాగుతుందన్నారు. లొంగిపోని నక్సలైట్లపై జీరో-టాలరెన్స్ విధానాన్ని అవలంబిస్తోందన్నారు. వచ్చే ఏడాది మార్చి 31 నాటికి దేశం నక్సల్ రహితంగా ఉంటుందని స్పష్టం చేశారు.