ఆకర్షణీయమైన ఆటల గది ప్రారంభం
NEWS Mar 20,2025 01:26 pm
జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం గుల్లకోట మండల ప్రజా పరిషత్ ప్రభుత్వ పాఠశాలలో ఆటల గదిని హెచ్ఎం చందూరి రాజిరెడ్డి గురువారం ప్రారంభించారు. బహుళ ప్రయోజనాలతో ఆకర్షిస్తున్న ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యను అభ్యసించే దిశగా విద్యార్థిని, విద్యార్థులను ఆకర్షించేందుకు గాను దీనిని ఏర్పాటు చేశామన్నారు. పాఠశాల అభివృద్ధికి మంజూరైన నిధుల నుంచి రూ. 10 వేలు పెట్టి వెచ్చించినట్లు తెలిపారు.