విద్యారంగాన్ని విస్మరించిన బడ్జెట్
NEWS Mar 19,2025 04:57 pm
విద్యారంగాన్ని విస్మరించిన రాష్ట్ర బడ్జెట్ అని ఏబీవీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మల్యాల రాకేష్ విమర్శించారు. ఈ సందర్భంగా రాకేశ్ మాట్లాడుతూ.. రాష్ట్ర బడ్జెట్లో విద్యారంగానికి కేవలం 7% నిధులు కేటాయించడం సిగ్గుచేటన్నారు. యూనివర్సిటీలకు కేవలం 500 కోట్లు కేటాయించడం బాధాకరమని, బడ్జెట్ ను వెనక్కి తీసుకొని విద్యారంగానికి 15% నిధులు, అలాగే శాతవాహన యూనివర్సిటీకి 100కోట్లు కేటాయించాలని, బోధన బోధనేతర సిబ్బందిని వెంటనే నియమించాలని, హాస్టల్ సమస్యలను పరిష్కరించాలని ఏబీవీపీ డిమాండ్ చేస్తోందన్నారు.