మోర్గి ఆదర్శ పాఠశాలలో వార్షికోత్సవ వేడుకలు
NEWS Mar 19,2025 06:22 pm
నగల్ గిద్ద మండలంలోని మోర్గి ఆదర్శ పాఠశాల, కళాశాల వార్షికోత్సవాన్ని బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నారాయణఖేడ్ డీఎస్పీ వెంకట్ రెడ్డి హాజరయ్యారు. 10వ తరగతి విద్యార్థులు కష్టపడి చదవాలని, వంద శాతం మార్కులు సాధించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ సాయిలు, ప్రధాన ఉపాధ్యాయులు రవీందర్ , ప్రిన్సిపల్ సువర్ణ పాల్గొన్నారు. విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నారు. అనంతరం డీఎస్పీ, ఎస్ఐని ఘనంగా సన్మానించారు.