మహిళలను మద్యం తాగమంటారా..?
NEWS Mar 19,2025 05:25 pm
మాజీ మంత్రి హరీశ్ రావు షాకింగ్ కామెంట్స్ చేశారు. కాంగ్రెస్ సర్కార్ పై భగ్గుమన్నారు. యువతను, మహిళలను మద్యం తాగమంటారా అని ప్రశ్నించారు. మద్యం అమ్మకం ద్వారా బీఆర్ఎస్ పాలనలో కంటే రూ.14 వేల కోట్లు ఎక్కువగా సంపాదించాలని అనుకోవడం పట్ల మండిపడ్డారు. మాల్ తక్కువగా అమ్మారని అధికారులకు మెమోలు ఇస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక తాజాగా అసెంబ్లీలో ప్రవేశ పెట్టిన బడ్జెట్ అన్ని వర్గాలను మోసం చేసేలా ఉందని ఆరోపించారు.