కాంగ్రెస్ సర్కార్ బడ్జెట్ బక్వాస్
NEWS Mar 19,2025 05:03 pm
మాజీ మంత్రి కేటీఆర్ నిప్పులు చెరిగారు. అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రభుత్వం 2025-26 సంవత్సరానికి సంబంధించి బడ్జెట్ ను ప్రవేశ పెట్టారు ఆర్థిక మంత్రి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క. దీనిపై సీరియస్ గా స్పందించారు . ఈ బడ్జెట్ ఢిల్లీకి మూటలు పంపించేందుకు ఉపయోగపడేలా ఉందంటూ ఆరోపణలు చేశారు. పదేళ్ల రథ చక్రానికి పంక్షర్ వేశారంటూ ఎద్దేవా చేశారు. రూ. లక్షల కోట్ల అప్పునకు టార్గెట్ పెట్టారంటూ ఫైర్ అయ్యారు. రూ. 6 వేల కోట్లు పార్టీ కార్యకర్తలకు పంచి పెడతారా అని ప్రశ్నించారు. యువ వికాసం కాదు కాంగ్రెస్ వికాసమన్నారు.