అన్న ప్రసాద కేంద్రంలో అదనపు ఈవో తనిఖీలు
NEWS Mar 19,2025 04:34 pm
ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు మార్చి 20, 21వ తేదీలలో తిరుమలలో పర్యటించనున్నారు. దీంతో భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తోంది టీటీడీ పాలక మండలి. ఇందులో భాగంగా అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరి బుధవారం తిరుమలలోని మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్న ప్రసాద కేంద్రంలో తనిఖీలు నిర్వహించారు.టీటీడీ విజిలెన్స్, ఇంజినీరింగ్, గార్డెన్, అన్న ప్రసాదం అధికారులతో ముఖ్యమంత్రి పర్యటనకు చేయాల్సిన ఏర్పాట్లపై పలు సూచనలు చేశారు.