డ్రగ్ రహిత జిల్లాగా రూపు దిద్దడమే లక్ష్యం
NEWS Mar 19,2025 04:24 pm
డ్రగ్ రహిత జిల్లాగా ములుగును రూపుదిద్దడమే ప్రధాన లక్ష్యంగా కృషి చేస్తున్నట్లు ములుగు డీఎస్పీ రవీందర్ అన్నారు. జిల్లా కేంద్రంలోని సాధన స్కూల్లో డ్రగ్స్ ఉపయోగించడం వల్ల కలిగే నష్టాలను విద్యార్థులకు వివరించి, వాటికి విద్యార్థులు దూరంగా ఉండాలన్నారు. మీ పక్క వారు ఎవరైనా డ్రగ్స్కు అలవాటు పడితే స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చి వారి భవిష్యత్ను కాపాడాల్సిన బాధ్యత మీపై ఉంటుందని ఆయన అన్నారు.