వేతనాల కోసం ఆశా వర్కర్ల ఆందోళన
NEWS Mar 19,2025 05:32 pm
తమకు కనీస వేతన చట్టం అమలు చేయాలని, ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు రూ. 18 వేలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఆశా వర్కర్లు ఆందోళన బాట పట్టారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ముందు సీఐటీయూ ఆధ్వర్యంలో రాస్తారోకో చేపట్టారు. సర్కార్ ఏర్పడి ఏడాది గడిచినా తమ గురించి పట్టించు కోవడం లేదంటూ వాపోయారు. బడ్జెట్ లో కూడా తమను పట్టించుకోక పోవడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది మాటల సర్కార్ అని తేలి పోయిందన్నారు.