నరసింహ స్వామి ఆలయ అభివృద్దిపై ఫోకస్
NEWS Mar 19,2025 10:34 am
మంగళగిరి లోని శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ అభివృద్దిపై మంత్రి నారా లోకేష్ సమీక్ష చేపట్టారు. ఈ మేరకు తయారు చేసిన మాస్టర్ ప్లాన్ ను ఆయన పరిశీలించారు. రాష్ట్రంలోని ప్రముఖ దేవాలయాల తరహాలో మంగళగిరి ఆలయ అభివృద్ధి జరగాలని స్పష్టం చేశారు. ప్రశాంత వాతావరణంలో భక్తులు స్వామి వారిని దర్శించు కోవాలని, మౌలిక వసతుల కల్పనతో పాటు మెరుగైన సౌకర్యాలు అందించాలని ఆదేశించారు మంత్రి.