క్షేమంగా చేరిన సునీతా విలియమ్స్
NEWS Mar 19,2025 09:45 am
భారత దేశానికి చెందిన ప్రముఖ వ్యోమోగామి సునీతా విలియమ్స్ తో పాటు బుచ్ విల్మోర్ 9 నెలల అనంతరం భూమి మీదుకు క్షేమంగా చేరుకున్నారు. ఇటు భారత్ తో పాటు అమెరికా ప్రజలు ఎంతో ఉత్కంఠతో వీరి రాక కోసం ఎదురు చూశారు. నాసా వ్యోమగాములు, తోటి అమెరికన్ నిక్ హేగ్ , రష్యన్ వ్యోమగామి అలెగ్జాండర్ గోర్బునోవ్లతో కలిసి బుధవారం అర్ధరాత్రి 3.27 గంటలకు సురక్షితంగా ల్యాండ్ అయ్యారు. స్పేస్ఎక్స్ క్రూ డ్రాగన్ క్యాప్సూల్, ఫ్రీడమ్ , భూమి వాతావరణం గుండా దూసుకు వెళ్లి 1650 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతను తట్టుకుని తల్లాహస్సీ సమీపంలోని గల్ఫ్ ఆఫ్ మెక్సికోలో పారా చూట్ ద్వారా దిగారు.