మాలలకన్నా మాదిగలకే జాబ్స్ ఎక్కువ
NEWS Mar 18,2025 04:17 pm
అసెంబ్లీలో సంచలన వ్యాఖ్యలు చేశారు కాంగ్రెస్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. మాలల కంటే మాదిగలకే తెలంగాణలో జాబ్స్ ఎక్కువగా వచ్చాయని వాపోయారు. 2016 నుంచి 2024 వరకు 66522 ఉద్యోగాలు మాదిగలకు రాగా 48388 ఉద్యోగాలు మాలలకు వచ్చాయని తెలిపారు. 64351 డబుల్ బెడ్రూం ఇండ్లు మాదిగలకు, 41413 మాలలకు ఇచ్చారని పేర్కొన్నారు. 10776 మంది మాదిగలకు ఎస్సీ కార్పొరేషన్ నిధులు అందగా 3759 మంది మాలలకు నిధులు అందాయని ఆవేదన వ్యక్తం చేశారు.