ఏపీలో బిట్స్..ఏఐ వర్శిటీల ఏర్పాటు
NEWS Mar 18,2025 03:02 pm
శాసన సభలో సంచలన ప్రకటన చేశారు మంత్రి నారా లోకేష్ . రాష్ట్రానికి కొత్తగా యూనివర్శిటీలు రానున్నాయని తెలిపారు. అమరావతిలో బిట్స్ పిలానీ, విశాఖపట్టణంలో ఏఐ వర్శిటీలు ఏర్పాటు కానున్నాయని ప్రకటించారు. టాటా గ్రూప్, ఎల్ అండ్ టీ, ఐఐటీ మద్రాస్ కలిసి డీప్ టెక్ యూనివర్సిటీని తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. దేశంలోని టాప్ వర్సిటీలను ఏపీలోని అన్ని ప్రాంతాలకు తీసుకొచ్చే లక్ష్యంతో పని చేస్తున్నామని అన్నారు మంత్రి. ప్రైవేట్ యూనివర్శిటీల ఏర్పాటుకు సంబంధించి ఉన్న లోపాలను సరి చేస్తామన్నారు.