మాజీ మంత్రి కేటీఆర్ దాఖలు చేసిన పిటిషన్ పై మంగళవారం హైకోర్టులో విచారణ జరిగింది. మహాదేవ్పూర్ పీఎస్లో నమోదైన ఎఫ్ఐఆర్ను కొట్టి వేయాలంటూ కేటీఆర్ కోరారు. మేడిగడ్డ బ్యారేజీపై అనుమతి లేకుండా డ్రోన్ ఎగుర వేశారంటూ కేటీఆర్పై కేసు నమోదు అయ్యింది. ఈ కేసుకు సంబంధించి ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత తీర్పును రిజర్వు చేసింది హైకోర్టు.