అధికారుల తీరుపై దానం ఫైర్
NEWS Mar 18,2025 12:38 pm
కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే దానం నాగేందర్ స్వంత సర్కార్ తీరుపై మండిపడ్డారు. అసెంబ్లీ జీరో అవర్ లో అధికారుల తీరుపై మండిపడ్డారు. తాను ఫోన్ చేసినా సరైన రెస్పాన్స్ ఇవ్వడం లేదని మండిపడ్డారు. ఈద్గా గ్రౌండ్ పక్కన క్యాంపు ఆఫీస్కు స్థలం ఇవ్వమని అడిగానని ఇప్పటి వరకు స్పందించిన దాఖలాలు లేవన్నారు. అధికారుల మీద ప్రివిలేజ్ నోటీస్ ఇస్తానని హెచ్చరించారు. తనకు సమాచారం ఇవ్వకుండానే విద్యుత్ సబ్ స్టేషన్ ను ఏర్పాటు చేశారని అన్నారు. వారంతకు వారే మాట్లాడుకుని కాంప్రమైజ్ అవుతున్నారని ఆరోపించారు.