నిరుపేద అమ్మాయిని ఆదుకోండి
NEWS Mar 18,2025 12:41 pm
హోలీ పండుగ నాడు మొగిలిపేట గ్రామానికి చెందిన పదేళ్ల చిన్నారి విజయలక్ష్మి గేటు పడి తలకు తీవ్రంగా గాయమైంది. ఆమె నరం పూర్తిగా దెబ్బ తినడంతో శస్త్ర చికిత్స చేయాల్సి ఉందని వైద్యులు సూచించారు. ఇందు కోసం రూ. 4 లక్షలకు పైగా ఖర్చవుతుందని చెప్పడంతో తల్లిదండ్రులు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. హెచ్ ఎం తన వంతుగా రూ. 5 వేలు, స్నేహితులు రూ. 13 వేలు అందజేశారు. దాతలు, మానవతావాదులు ఎవరైనా ఉంటే ఆదుకోవాలని కోరుతున్నారు పేరెంట్స్.