పీఎం మోదీకి సీఎం రేవంత్ లేఖ
NEWS Mar 18,2025 08:10 am
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రధాని మోదీకి సుదీర్ఘ లేఖ రాశారు. కాంగ్రెస్, బీఆరెస్, బీజేపీ, ఎంఐఎం, సీపీఐ నాయకులతో తనను కలిసేందుకు అవకాశం ఇవ్వాలని కోరారు. స్థానిక సంస్థలతో పాటు విద్య, ఉద్యోగ రంగాల్లో వెనుకబడిన తరగతులకు రిజర్వేషన్లు 42 శాతానికి పెంచాలని కోరుతూ రెండు బిల్లులను తెలంగాణ అసెంబ్లీలో ప్రవేశ పెట్టడం, వాటికి ఆమోదం తెలపడం జరిగింది. ఈ నేపథ్యంలో బిల్లులకు కేంద్రం మద్దతు ఇవ్వాలని కోరారు రేవంత్ రెడ్డి.