ఎమ్మెల్యే వంశీకృష్ణకు సీఎం పరామర్శ
NEWS Mar 17,2025 08:33 pm
అనారోగ్యంతో బాధ పడుతున్న అచ్చంపేట ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ ప్రస్తుతం హైదరాబాద్ లోని బంజారా హిల్స్ స్టార్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు విషయం తెలుసుకున్న సీఎం రేవంత్ రెడ్డి సోమవారం ఎమ్మెల్యేను పరామర్శించారు. ఆరోగ్యం ఎలా ఉందంటూ ఆరా తీశారు. తన ఆరోగ్యం నిలకడగానే ఉందని ఈ సందర్బంగా ఎమ్మెల్యే తెలిపారు. మెరుగైన వైద్యం అందించాలని సీఎం ఆదేశించారు ఆస్పత్రి యాజమాన్యాన్ని.