రేవంత్ రెడ్డి బాగోతం నాకు తెలుసు
NEWS Mar 17,2025 06:13 pm
మాజీ మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి బాగోతం గురించి తనకు తెలుసంటూ పేర్కొన్నారు. ఆయన ఎక్కడెక్కడ గోడలు దూకుతాడో తెలియదని అనుకుంటే ఎలా అని ప్రశ్నించారు. ఇప్పటకీ సెల్ఫ్ డ్రైవింగ్ చేసుకుంటూ ఉదయం 5 గంటలకు మైహోం బూజాకు రేవంత్ రెడ్డి వెళ్తున్నాడని ఆరోపించారు. సాగర్ సొసైటీలో ఎంత సమయం గడిపేవాడో కూడా తెలుసన్నారు. బీజేపీ నేతల బాగోతాలు కూడా నా దగ్గర ఉన్నాయంటూ వ్యాఖ్యానించారు. పదేళ్లు పవర్ లో ఉన్న తమకు ఎవరు ఏమిటనేది బాగా తెలుసన్నారు కేటీఆర్. బీజేపీ, కాంగ్రెస్ నేతల రహస్య మీటింగ్ పై రాజాసింగ్ కామెంట్స్ చేసినా ఎందుకు స్పందించ లేదన్నారు.