గొర్రెల మందపై కుక్కల దాడి
NEWS Mar 17,2025 06:29 pm
మెట్ పల్లి మండలం వేంపెట్ లో రాచర్ల అంజయ్యకు చెందిన గొర్రెల మంద పై కుక్కలు దాడి చేశాయి. ఈ ఘటనలో 22 గొర్రెలు మృతి చెందగా.8 గొర్రెలకు గాయాలయ్యా యని యజమాని అంజయ్య ఆవేదన వ్యక్తం చేశాడు. సుమారు రూ.2 లక్షల మేర నష్టం వాటిల్లిందని కన్నీటి పర్యంతమయ్యాడు. ఎంపీడీఓ కు తెలిపి ప్రభుత్య పరంగా ఆదుకునే విధంగా ప్రయత్నం చేస్తామని బ్లాక్ కాంగ్రెస్ నేత అల్లూరి మహేందర్ రెడ్డి హామీ ఇచ్చారు. .పశువైద్యకారిని. మనీషా, మండల రెవన్యూ అధికారి కాంతయ్య, పశువైద్య సిబ్బంది గాయాలైన గొర్రెలకు చికిత్స చేశారు.