వేతనాలు పెంచాలని ఆశా వర్కర్ల ఆందోళన
NEWS Mar 17,2025 06:33 pm
ములుగు జిల్లా కేంద్రంలోని కలెక్ట ర్ కార్యాలయం వద్ద ఆశా వర్కర్లు నిరసన కార్యక్రమం చేపట్టారు. అసెంబ్లీ సమావేశాలలో ఆశ వర్కర్లకు కనీస వేతనం 18 వేల రూపాయలు కల్పించాలని, ప్రమోషన్, ఈఎస్ఐ, పిఎఫ్ ఉద్యోగ భద్రత కల్పించేలా బిల్లు ప్రవేశ పెట్టాలని ఆశ వర్కర్ల జిల్లా అధ్యక్షురాలు రత్నం నీలాదేవి డిమాండ్ చేశారు. అనంతరం ఎమ్మార్వో విజయ భాస్కర్ కు వినతి పత్రం అందజేశారు.