సైబర్ మోసాలపై పోలీసుల అవగాహన
NEWS Mar 17,2025 06:37 pm
ఎండపల్లి మండలం ముంజంపల్లి గ్రామంలో బసంత్ నగర్ ఎస్ఐ, పెద్దపల్లి సీఐ సహచర పోలీసులతో సైబర్ నేరాలపై ప్రజలతో సోమవారం అవగాహన సమావేశం ఏర్పాటు చేశారు. ముంజంపల్లి గ్రామంలో నిఘా నేత్రాలు ఏర్పాటు చేసుకోవాలని, ఏ సమస్య వచ్చినా 100 కు డైల్ చేయాలని పెద్దపల్లి సీఐ కె. ప్రవీణ్ కుమార్ గ్రామ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అదే విధంగా 1930 ప్రాముఖ్యతను వివరించారు. బసంత్నగర్ ఎస్ఐ ఆర్. స్వామి, పోలీసులు, ప్రజలు పాల్గొన్నారు.