'కోర్టు' 3 రోజుల్లోనే ₹ 24.4 కోట్లు
NEWS Mar 17,2025 11:52 am
హీరో నాని నిర్మాతగా తెరకెక్కించిన 'కోర్టు' మూవీ కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. విడుదలైన 3 రోజుల్లోనే ఈ చిత్రం ₹ 24.4 కోట్లు వసూలు చేసినట్లు మూవీ యూనిట్ ట్వీట్ చేసింది. ప్రేక్షకులు బ్లాక్బస్టర్ తీర్పు ఇచ్చారని పేర్కొంది. రామ్ జగదీశ్ తెరకెక్కించిన ఈ సినిమాలో ప్రియదర్శి, రోషన్, శ్రీదేవి, శివాజీ కీలక పాత్రలు పోషించారు. మరోవైపు ఈ మూవీ USAలో 600K డాలర్లు రాబట్టిందని సినీ వర్గాలు తెలిపాయి.