అమెరికా ఫ్లోరిడాలో రోడ్డు ప్రమాదం
NEWS Mar 17,2025 06:04 am
అమెరికాలోని రోడ్డు ప్రమాదంలో రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గానికి చెందిన ముగ్గురు మృత్యువాతకు గురయ్యారు. కొందర్గు మండలం టేకులపల్లి గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ మోహన్ రెడ్డి కూతురు ప్రగతి రెడ్డి (35), మనవడు హార్వీన్ (6), కూతురు అత్త సునీత (56) మృతి స్పాట్ లో మృతి చెందినట్లు సమాచారం. కాగా ఒకే గ్రామానికి చెందిన ముగ్గురు అమెరికాలో మృతి చెందడం పట్ల విషాదం అలుముకుంది.