బండి కామెంట్స్ ఆది సీరియస్
NEWS Mar 17,2025 08:28 am
తమ సర్కార్ పై అనుచిత వ్యాఖ్యలు చేయడం మానుకోవాలని హితవు పలికారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ పటేల్ కు. రాచరిక పాలన సాగిస్తున్నది ఎవరో దేశ ప్రజలందరికీ తెలుసన్నారు. గత పదేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వానికి సహకరించింది మీరు కాదా అని ప్రశ్నించారు. ఇప్పుడు చిలుక పలుకులు పలికితే ప్రజలు నమ్ముతారని అనుకోవడం భ్రమ అన్నారు. ప్రశ్నించే గొంతుకలను ఎక్కడికక్కడ అరెస్ట్ చేసుకుంటూ పోతే ఒక్కనాడైనా బీజేపీ నేతలు ప్రశ్నించారా అని నిలదీశారు. సీఎంను విమర్శించే హక్కు బీజేపీకి, బండికి లేనే లేదన్నారు ఆది.