నేటి నుంచి రాజీవ్ యువ వికాసం
NEWS Mar 17,2025 07:45 am
రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. యువతకు తీపి కబురు చెప్పింది. నేటి నుంచి రాజీవ్ యువ వికాసం పథకాన్ని ప్రారంభించనుంది. ఈ మేరకు దరఖాస్తుల ప్రక్రియకు శ్రీకారం చుట్టనున్నారు సీఎం ఎ. రేవంత్ రెడ్డి. ఆన్ లైన్ లో వచ్చే నెల ఏప్రిల్ 5 వరకు దరఖాస్తులను స్వీకరించనున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ యువతకు స్వయం ఉపాధి కల్పించనున్నారు దీని ద్వారా. 5 లక్షల మంది యువతకు రూ. 6 వేల కోట్ల రాయితీలు ఇవ్వనుంది సర్కార్.