బెట్టింగ్ యాప్ లను ప్రమోట్ చేయొద్దు
NEWS Mar 17,2025 07:36 am
టీజీఎస్ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ వీసీ సజ్జనార్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన గత కొంత కాలం నుంచి బెట్టింగ్ యాప్ ల గురించి ప్రచారం చేస్తున్నారు. ప్రజలను ముఖ్యంగా యూత్ ను వాటి బారిన పడవద్దంటూ కోరుతున్నారు. అంతే కాకుండా బెట్టింగ్ యాప్ లను కావాలని ప్రమోట్ చేస్తూ వస్తున్న యూట్యూబర్స్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎక్స్ వేదికగా స్పందించిన ఎండీ వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ఈ యాప్ ల కారణంగా చాలా మంది సూసైడ్ చేసుకున్నారని ఆవేదన చెందారు. తమ ఆదాయం కోసం ఇతరుల ప్రాణాలతో చెలగాటం ఆడటం ఎంత వరకు సబబు అని ప్రశ్నించారు ఎండీ.