బీసీలు సామాజిక, రాజకీయంగా రాణించాలి
విద్యార్థి సంఘం జిల్లా నేత రమేష్
NEWS Mar 16,2025 07:29 pm
బీసీలు సామాజిక, రాజకీయ రంగాల్లో రాణించాలని జగిత్యాల జిల్లా విద్యార్థి సంఘం నేత జాజాల రమేష్ హితవు పలికారు. ధర్మపురి మండలం నేరెల్ల గ్రామంలో బీసీ సంఘం నేతలతో రమేష్ సమావేశం ఏర్పాటు చేశారు. రాజ్యాంగం ద్వారా సంక్రమించిన 42 % రిజర్వేషన్లు బీసీలు సాధించాలని, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ లు సత్తా చాటాలని, బీసీలు జెండాలు మోసే స్థాయి నుంచి జెండాలు ఎగరేసే స్థాయికి ఎదగాలని హితవు పలికారు.