రూ. 630.27 కోట్ల అభివృద్ది పనులకు శ్రీకారం
NEWS Mar 16,2025 04:45 pm
వరంగల్ జిల్లా స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గంలో రూ. 630.27 కోట్ల అభివృద్ధి పనులను వర్చువల్గా ప్రారంభించారు సీఎం రేవంత్ రెడ్డి. రూ.200 కోట్లతో జాఫర్గఢ్ మండలంలోని కోనాయాచలం గ్రామంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కు, రూ.5.5 కోట్లతో ఘన్ఫూర్లో డిగ్రీ కాలేజీ ఏర్పాటుకు, రూ.45.5 కోట్లతో ఘన్ఫూర్లో 100 పడకల ఆస్పత్రికి, రూ.26 కోట్లతో ఘన్ఫూర్లో ఇంటిగ్రేటెడ్ డివిజనల్ లెవల్ ఆఫీస్ కాంప్లెక్స్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. రూ.148.76 కోట్లతో దేవాదుల రెండో దశ పూర్తి చేసేందుకు కూడా శ్రీకారం చుట్టారు.