ప్రభుత్వ లక్ష్యం ప్రజా సంక్షేమం
NEWS Mar 16,2025 04:41 pm
వరంగల్ జిల్లా స్టేషన్ ఘనపూర్ లో జరిగిన సభలో ప్రసంగించారు మంత్రి దాసరి సీతక్క. తమ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు చేస్తున్నామన్నారు. ప్రజా పాలన కొనసాగుతోందన్నారు. అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేకూర్చేందుకు దమ్మున్న లీడర్ రేవంత్ రెడ్డి సారథ్యంలో కృషి చేస్తున్నామని చెప్పారు. గతంలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్రానికి నిధులు తీసుకు రావడంలో సీఎం కీలక పాత్ర పోషించారని కొనియాడారు. తమ ప్రభుత్వం పూర్తిగా విద్య, వైద్యం, ఉపాధి కల్పించడం పైనే దృష్టి సారించిందన్నారు. పేదరికం లేకుండా చేయాలన్న సంకల్పంతో ముందుకు సాగుతున్నామన్నారు.